Wednesday, August 6, 2008

టివి-9 వర్మ సాక్షి టీవీలోకి జంపు?

మీడియా రంగంలో పనిచేస్తున్న వారికి ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అయిదారు నెలలకి కూడా జీతాలు అందుకోలేని పరిస్ఠితి నుండి జర్నలిస్టులు ఇప్పుడు లక్షల్లో ప్యాకేజీలు అందుకునే స్ఠితికి చేరుకున్నారు. నిజంగా వృత్తే ధైవంలా భావించి చేసేవాళ్లకు ఈ మార్పు మంచిదే. కానీ అవకాశం దొరికింది కదాని, జంపింగ్ లు చేసి యాజమాన్యాలతో బేరసారాలు ఆడేవాళ్లని అసలు ఎక్కడా అవకాశాలు లేకుండా ఏరిపారేయాలి. ఇలా చేసే పరిస్ఠితే వస్తే మొట్టమొదట ఆ అవకాశం టివి-9లో శ్రీకాకుళం రిపోర్టర్ గా పనిచేస్తున్న వర్మకు ఇవ్వాల్సి ఉంటుంది. టివి-9లో అవకాశం కోసం సొంత జిల్లాను సైతం వదిలి వచ్చిన వర్మ ఇప్పుడు సాక్షి టీవీలోకి జంపైనట్లు తెలిసింది. భారీ ప్యాకేజీతో విశాఖపట్నం బ్యూరో చీఫ్ గా వస్తున్నట్టు శ్రీకాకుళం నుండి వార్తలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ పేరు చెప్పి శ్రీకాకుళంలో అయిదు లక్షల రూపాయల వరకూ వసూలుచేసి కనీసం సభ్యులకు కూడా సమాధానం చెప్పకుండా తిరుగుతున్న వీడు ఇప్పుడు విశాఖలోనూ వెలగబెట్టనున్నాడు.

No comments: