Monday, September 22, 2008

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కుంభకోణం!

దీక్షకు సిద్ధపడిన ఎస్.డి.వి. శేఖర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోతే సంఘం పెద్దలు బహిరంగంగా ప్రకటన చేయవచ్చు. సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఇప్పటివరకు జరిగిన వ్యవహారాన్ని సభ్యులకు తెలియజేసి మద్దతు కూడగట్టవచ్చు. కానీ సంఘం పెద్దలు అవేమీ చేయడం లేదంటే అనుమానాలు బలపడక ఏం చేస్తాయ్.
శేఖర్ పేరుకే పిచ్చివాడు కానీ వాడు చేస్తున్న వాదన పిచ్చిది కాదుకదా? అప్పులు చేసి డబ్బులు కట్టినవాళ్ల పరిస్థితి ఏమిటి? సంఘంలోని కొంతమంది నాయకులలా మిగతా వారు అడ్డదారుల్లో ౩.౩౦ లక్షల రూపాయలు కట్టలేదన్న విషయం వీరికి తెలియంది కాదు కాబట్టి వ్యవహారాన్ని త్వరగా తేలిస్తే మంచిది. కేబినెట్లో చర్చకు రానంత మాత్రాన మనకు జిల్లా కలెక్టర్ అడ్వాన్సు పొజిషన్ ఇచ్చిన స్థలం మనది కాకుండా పోదు కాబట్టి తక్షణం స్థలాన్ని పూర్తి మొత్తాన్ని కట్టిన వారికి తొలి ప్రాధాన్యతగా లాటరీ పద్దతిన పంపిణీ చేయడం మర్యాదదాయకం. లేకుంటే సంఘంపై వస్తున్న ఆరోపణలు నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది.
(పూర్తి వివరాలకు అప్డేట్ కోసం ఎదురుచూడండి.)

వి.జె.ఎఫ్. నిధుల గోల్ మాల్!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమం పేరిట ఏర్పాటైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వి.జె.ఎఫ్.) క్రమేణా తన లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోంది. తన బాధ్యతలను ట్రేడ్ యూనియన్లు హైజాక్ చేసుకుపోతుంటే మిన్నకుండిపోవడమే కాకుండా క్లబ్బుకి వస్తున్న ఆదాయాన్ని కైంకర్యం చేసే సంస్క్రుతిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. గతంలో కమిటీలోని ఒకరిద్దరు మాత్రమే అక్రమార్జనకు పాల్పడితే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అందిన కాడికి నొల్లుకుంటున్నారట! ఇందులో ఏమాత్రం నిజముందో వచ్చేవారం వరకు ఆగాల్సిందే!! సభ్యులను నిలువునా మోసం చేస్తున్న వి.జె.ఎఫ్. పాలకుల బండారాన్ని బట్టబయలు చేయడంలో ముఖ్యోద్దేశం మీకు తెలిసిందే.

విశాఖ కలెక్టరేట్లో కక్కుర్తి విలేఖర్లు

విశాఖ సమాచారం, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల విలేఖరులు కలెక్టరేట్లోకి అడుగుపెట్టారంటే అన్ని సెక్షన్ల అధికారులూ అప్రమత్తమవుతుంటారు. పొరపాటున కలెక్టరో, జాయింట్ కలెక్టరో అటువైపుగా వస్తున్నారన్నా పెద్దగా స్పందించని సిబ్బంది, సెక్షన్ అధికారులూ ఈ కలం వీరులు వస్తున్నారంటే మాత్రం ఉలిక్కిపడుతూంటారు. ఈ మీడియా మొనగాళ్ల హవా తగ్గించాలని ఉద్యోగులు ఏంత కోరినా ఇన్ఛార్జి పెద్దలు ఖాతరు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. వీళ్లు కలెక్టరేట్లో గడుపుతున్న సమయంలో అధిక భాగం వార్తల సేకరణ కంటే సొంత పైరవీలకే వెచ్చిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఈ మాట తోటి విలేఖరులే అంగీకరిస్తారు. కొంతమంది అధికారుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన విలేఖరుల గురించి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు ఇప్పటికైనా దృష్టిపెడితే మంచిది. లేదంటే, వాళ్ల అక్రమాలకు పెద్దల తోడ్పాటుకూడా ఉందని బయటి ప్రపంచం సైతం ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు.
(తరువాయి అప్డేట్ కోసం వేచిచూడండి)

జర్నలిస్టుల జేబులు నింపిన వినాయకుడు!

వినాయకుడే విశాఖలో జర్నలిస్టులకు వేలకు వేలు ఇప్పించింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ గణేష్ కుమార్ ఏ ఉద్దేశంతో ప్రచారాన్ని ఇంతలా నిర్వహించారో తెలియదు కానీ అయిదు పెద్ద పత్రికల విలేఖరులు మాత్రం తలో 10 వేల రూపాయలు వెనకేసుకున్నారు. దేవుడైనా ప్రచారానికి తప్పదు ముడుపులు!!!

Wednesday, August 20, 2008

విలేఖరులొస్తున్నారు... హాస్టల్ వార్డెన్లూ జాగ్రత్త!

అదేమిటో తెలియదు కానీ, శ్రీకాకుళం జిల్లాలో హాస్టల్ వార్డెన్లు విలేఖరులను చూస్తే భయపడి చస్తున్నారు. ఏమైందని ఎవర్ని ప్రశ్నించినా ఒకటే సమాధానం! ఏజెన్సీ సరిహద్దు గ్రామాలపై ఏనుగుల గుంపు దాడి జరిపినట్టు తమపై విలేఖరుల దండు వచ్చిపడుతోందంటూ వార్డెన్లు, హాస్టల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ జిల్లాలో విలేఖరుల ఆగడాలు పెచ్చుమీరిపోయాయి. ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికలకూ ఇక్కడ రిపోర్టర్లు ఉన్నట్టే వసూళ్లలో కూడా వీళ్లు తమదే పైచేయి అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వారం రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు పదిహేను పత్రికల జాబితాతో శ్రీకాకుళం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి నుంచి పదిహేను వేల రూపాయలు స్వాహా చేశారు. మరోపక్క ఏలూరు పత్రికల వాళ్లు తమ నలభై మంది జాబితాతో ఎలాగూ హాస్టల్ వార్డెన్లను బెదిరించి డబ్బులు చేసుకుంటున్నారు. పత్రికా రంగంలో ఇరవయ్యేళ్ల సీనియర్నని గొప్పలు చేప్పుకునే బ్రాహ్మణ జర్నలిస్టొకడు ఈమధ్య "ఎన్కౌంటర్" ప్రతినిధినంటూ బాహాటంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. కక్షకొలదీ వీడు ఎవడిపైన పడితే వాడిపైన లేనిపోని రాతలు రాసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని తెలియక ఆ పత్రిక యాజమాన్యం ఆయా చెత్త రాతలను ప్రచురిస్తూ ప్రోత్సహిస్తోంది. ఆమదాలవలస ఎమ్మెల్యే బి.సత్యవతిపై గత సంచికలో వీడు రాసిన రాతలను పరిశీలిస్తే వాడు ఎలాంటి వాడో తెలుస్తుంది. ఏకంగా పాతిక వేల రూపాయలు డిమాండ్ చేసిన వీడి ప్రయత్నం ఫలించలేదని అబద్దపు రాతలు రాసి తన దిర్బుద్దిని చాటుకున్నాడు. చివరికి అడగకుండానే అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్న జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తప్పుడు రాతలు రాసి మంత్రి ప్రత్యర్ధులైన టెక్కలి, పలాస ప్రాంతాలకు చెందిన ఇద్దరు నాయకుల వద్ద పది వేల రూపాయలు తీసుకున్నాడు.
(మరిన్ని వివరాలు వచ్చే అప్డేట్లో...)

బ్లాక్ మెయిల్ బాడుకోవు!

వీడిని వర్ణించడానికి ఇంతకన్నా మంచి పేరు దొరకలేదు. జర్నలిస్టు ముసుగులో శ్రీకాకుళం జిల్లాలో వీడు సాగిస్తున్న అరాచకాలకు వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. కంత్రీ సతీష్ గా స్థానికంగా పేరుమోసిన వీడి అసలు పేరు కోనె సతీష్ కుమార్. జిల్లా జర్నలిస్టులకే కాకుండా పక్క జిల్లాల వారికి కూడా తలనొప్పిగా తయారైన వీడి లీలలపై ప్రత్యేక కథనం...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Thursday, August 7, 2008

రాష్ట్ర చిన్న పత్రికల సంఘంలో చీలిక?

రాష్ట్ర చిన్న పత్రికల సంఘంలో చీలిక ఏర్పడిందా? తాజా పరిస్థితులు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. చిన్న, మధ్యతరహా పత్రికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న సంఘం అందరి సమస్యలపై కాకుండా కొందరికే పరిమితమవుతోందని ఆరోపిస్తూ "ఎస్మా" ఆవిర్భవించింది. ఎడిటర్స్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ పేరుతో కార్య రంగంలోకి దిగిన చీలిక వర్గం తన తొలి ప్రయత్నంలోనే అందరి అభినందనలు అందుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఎదురైన ఎల్.ఎ. ప్రకటనల సమస్యను పరిష్కరించేందుకు "ఎస్మా" చేసిన కృషి ఫలించి, తిరిగి పాత పద్ధతి అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సమాయాత్తమవుతోంది. జిల్లా యేతర ప్రాంతాల నుంచి ప్రచురితమవితున్న చిన్న, మధ్యతరహా పత్రికలకు ఎల్.ఎ. ప్రకటనలను నిలిపివేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి, పరిస్థితిని చక్కదిద్దడానికి కూడా ప్రస్తుత చిన్న పత్రికల సంఘం ప్రయత్నించని తరుణంలో "ఎస్మా" రంగంలోకి దిగి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో చర్చించి ఆయనతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ కు డి.ఒ. లెటర్ రాయించి సమస్య పరిష్కారానికి కృషిచేయడం కూడా ప్రస్తుత చిన్న పత్రికల సంఘానికి నాయకత్వం వహిస్తున్న వారిలో కొంతమందికి నచ్చినట్టులేదు. అందుకే "ఎస్మా" ప్రయత్నాలను అడ్డుకునే సాహసం చేస్తున్నారు. "అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు" అన్న సామెతను ఈ పదవి పిచ్చి నాయకులు సార్ధకం చేస్తున్నారు. రాష్ట్రంలో చిన్న పత్రికలకు సంధించి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంఘం ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కార్యవర్గంలో ఉన్న నాయకుల పత్రికల వరకే చూసుకుంటుండడం విమర్శలకు దారిస్తోంది. ఈ స్వార్ధపూరిత నాయకత్వాన్ని వ్యతిరేకించాలని చాలా మందికి ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎవరూ కూడా ఆ సాహసం చేయలేకపోయారు. బహుశా ఆ ధైర్యం తొలుత "ఎస్మా" నాయకులకే వచ్చిందేమో!
గతంలో విశాఖపట్నంలోని చిన్న పత్రికల జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఆర్టీసీ బస్ పాసుల జారీ సందర్భంగా ఎదురైన సమస్యను కూడా ఈ చిన్న పత్రికల సంఘం పరిష్కరించలేక తన చేతకాని తనాన్ని ఒప్పుకోలేక జర్నలిస్టుల సంఘాల వైఫల్యం వల్లే ఈ సమస్య ఎదురైందని సెలవిచ్చింది. ఈ సమస్య ఇప్పటికీ అలాగే అపరిష్కృతంగా ఉండిపోయింది. ఇదే విధంగా ఇళ్ల స్థలాల సమస్య కూడా పెండింగ్ లో పడింది. ఇక విజయనగరంలో కూడా ప్రకటనల విషయంలో ఎదురైన సమస్యలను అక్కడి జర్నలిస్టులే పరిష్కరించుకున్నారు తప్ప ఏ సంఘమూ తలదూర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘాల అవసరం చిన్న పత్రికలకు ఎంతవరకు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం సమస్యలు ఎదుర్కొంటున్న పత్రికల చేతుల్లోనే ఉందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

Wednesday, August 6, 2008

విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లకు "వార్త" విలేఖరి అండ

నర్సీపట్నం కేంద్రంగా పనిచేస్తున్న "వార్త" విలేఖరిపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జర్నలిజం ముసుగులో ఎర్నలిజానికి అలవాటుపడిన వీడి భాగోతం ఇటీవల ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది. స్మగ్లర్లకు అండగా నిలుస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడిపై ఇప్పటికే నాలుగైదు ఫిర్యాదులు "వార్త" కార్యాలయానికి వెళ్లినప్పటికీ వాటి గురించి పట్టించుకున్నవాడు లేకుండాపోయాడట. వీడి అవినీతిలో భాగం పంచుకుంటున్నట్టు కొంతమందిపై విమర్శలు కూడా వచ్చాయి. గత నెల చింతపల్లి నుంచి నర్సీపట్నం మీదుగా తరలిపోయిన సుమారు అర కోటి విలువైన గంజాయిని ఎక్సైజ్ కళ్లుగప్పి ఉంచేందుకు వీడు ఏకంగా ఐదు లక్షల రూపాయలు తీసుకున్న విషయం ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో హాట్ టాఫిక్ గా మారింది. గతంలో కూడా వీడిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. జర్నలిస్టుల సంఘం నాయకునిగా వీడు పాల్పడుతున్న అక్రమాలకు ఇక అడ్డేలేదు. జర్నలిజం ముసుగులోనే తన సొంత వ్యాపారాన్ని కూడా చాపకింద నీరులా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న వీడిపై స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుండి గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి వరకూ ఏ ఒక్కరికీ విశ్వాసం లేదు. లోకల్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నుండి ఎమ్మెల్యే కోటాలో అందరు జర్నలిస్టుల కంటే రెండిళ్లు ఎక్కువ తీసుకున్న రోజే వీడిపై తోటి జర్నలిస్టుల్లో విలువ తగ్గిపోయిందట. ప్రతీ చిన్న అవసరానికీ మండల, డివిజనల్ స్థాయి అధికారులపై వాలిపోయే వీడిలాంటి వాళ్లు సమాజానికి చీడపురుగులే!

టివి-9 వర్మ సాక్షి టీవీలోకి జంపు?

మీడియా రంగంలో పనిచేస్తున్న వారికి ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అయిదారు నెలలకి కూడా జీతాలు అందుకోలేని పరిస్ఠితి నుండి జర్నలిస్టులు ఇప్పుడు లక్షల్లో ప్యాకేజీలు అందుకునే స్ఠితికి చేరుకున్నారు. నిజంగా వృత్తే ధైవంలా భావించి చేసేవాళ్లకు ఈ మార్పు మంచిదే. కానీ అవకాశం దొరికింది కదాని, జంపింగ్ లు చేసి యాజమాన్యాలతో బేరసారాలు ఆడేవాళ్లని అసలు ఎక్కడా అవకాశాలు లేకుండా ఏరిపారేయాలి. ఇలా చేసే పరిస్ఠితే వస్తే మొట్టమొదట ఆ అవకాశం టివి-9లో శ్రీకాకుళం రిపోర్టర్ గా పనిచేస్తున్న వర్మకు ఇవ్వాల్సి ఉంటుంది. టివి-9లో అవకాశం కోసం సొంత జిల్లాను సైతం వదిలి వచ్చిన వర్మ ఇప్పుడు సాక్షి టీవీలోకి జంపైనట్లు తెలిసింది. భారీ ప్యాకేజీతో విశాఖపట్నం బ్యూరో చీఫ్ గా వస్తున్నట్టు శ్రీకాకుళం నుండి వార్తలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ పేరు చెప్పి శ్రీకాకుళంలో అయిదు లక్షల రూపాయల వరకూ వసూలుచేసి కనీసం సభ్యులకు కూడా సమాధానం చెప్పకుండా తిరుగుతున్న వీడు ఇప్పుడు విశాఖలోనూ వెలగబెట్టనున్నాడు.

Friday, August 1, 2008

నిజాలు రాసే జర్నలిస్టులకి ఆహ్వానం

సరైన ఆధారాలతో, సమగ్ర సమాచారంతో ఈ బ్లాగ్కి ఎవరైనా వార్తలు రాయొచ్చు. రాయడానికి వేదిక దొరికింది కదాని దయచేసి ఏదిపడితే అది రాసి పంపవద్దు. మీరు రాసే ఐటంలో విషయం ఉంటే దాన్ని తప్పకుండా బ్లాగ్లో పబ్లిష్ చేస్తాం. ఈ బ్లాగ్ని నడుపుతున్న ఉద్దేశం జర్నలిస్టుల్ని సరిదిద్దాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని పాఠకులు గమనించ ప్రార్ధన.

ఎడిటర్,
మీడియా డైరీ,
సూర్యారావుపేట,
విజయవాడ-2

వరంగల్ "వార్త" విలేఖరి అవినీతి బాగోతం!

వరంగల్ "వార్త" విలేఖరి అవినీతి బాగోతంపై ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈమధ్య వీడు రాసిన ఒక వార్తను చూపించి జిల్లా స్ఠాయి రాజకీయ నాయకుని వద్ద నుంచి ఇరవై వేల రూపాయలు గుంజుకున్న వైనం వెలుగు చూడ్డంతో ఈ ప్రముఖ పాత్రికేయుని చరిత్ర బయటపడింది. రెండు నెలల క్రితం ఇతగాడు వరంగల్ నగర కాంగ్రెస్ పార్టీ నాయకున్ని బెదిరించి పాతిక వేలు తీసుకున్న విషయం కూడా వెలుగులోకి రావడంతో ఆయన గారికి ఏం చేయాలో పాలుపోవడం లేదట!

గతంలో కూడా ఈయనపై పలు ఆరోపణలు వచ్చినా యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలన్నది కాదు విషయం, ఆయన వల్ల ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారన్నది గమనించాల్సి ఉంది. ఇతగాడి సంపాదన పిచ్చి ఎంతమందిని బలిచేస్తుందన్నది ఒక సారి పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యంపై లేదా? అన్న అనుమానాలు వ్యాప్తి చెందక ముందే యాజమాన్యం అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మేలని తోటి మిత్రుల అభిప్రాయం.

"టివి-9" పేరిట వర్తకులకు వేధింపులు

తిరుమలేశుని సన్నిధిలో "టివి-9" పేరిట వర్తకులకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆరోపణలు గతంలో అన్ని మీడియా సంస్ధల ప్రతినిధులపైనా వచ్చినప్పటికీ, ఈమధ్య కాలంలో ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై, అందునా "టివి-9" ప్రతినిధులపై ఎక్కువగా వస్తుండడం గమనార్హం.

దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుందని ఆ సంస్ధ యాజమాన్యం అనవచ్చేమో కానీ ఇందులో ఎలాంటి విమర్శలకూ తావులేదు. దీనికి నిదర్శనం ఈ ఆదివారం జరిగిన సంఘటనే! తిరుమల కొండపై హోల్సేల్ వ్యాపారం చేస్తూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న తమిళనాడుకు చెందిన వర్తకున్ని బ్లాక్ మెయిల్ చేసి యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిన విషయం "టివి-9" యాజమాన్యం ద్రుష్టికి వచ్చిందో లేదో కానీ తిరుమల, తిరుపతంతా ఈ విషయం గుప్పుమంది. దీంతో ఎన్నాళ్లగానో సాగుతున్న మీడియా లంచాల బాగోతం మరోమారు బయటపడినట్లైంది.

ఈనాడు చంద్రశేఖర్ అక్రమార్జన

ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతికి పలానా పత్రిక రిపోర్టరని లేదు. యాజమాన్యం ఎంత కఠినంగా ఉన్నా వాటిల్లో పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టిన వాడు తన నైజాన్ని మార్చుకోలేడనడానికి ఈనాడు చంద్రశేఖరే నిదర్శనం. డాబాగార్డెన్స్ డేట్ లైన్ పై వార్తలు రాసుకుని నెలకు వెయ్యో, పదిహేను వందలో సంపాదించుకునే వాడు ఉన్నట్టుండి లక్షలు ఎలా ఆర్జించాడన్నదాని గురించి యాజమాన్యం ఎందుకు ఆరా తీయడం లేదన్నది పక్కన పెడితే, విశాఖలో ఇటీవల వీడి ఆగడాలకు హద్దులేకుండాపోయింది. గత కొద్ది మాసాల నుండి కార్పోరేషన్ బీటు కూడా వెలగబెడుతున్న బినామీ సంపాదన (బి.ఎస్.) చంద్రశేఖర్ రెండు పెద్ద కేసుల్లో జి.వి.ఎం.సి. సిటీ ప్లానర్ రఘును ఇరికించే ప్రయత్నం కూడా చేశాడు. చివరికి విషయం మిగతా విలేఖరులకూ పొక్కడంతో అనుకున్న "ఫిగర్" తగ్గి వుండవచ్చుగానీ, ఆ రెండు కేసుల్లోనూ వీడి సంపాదన మూడు లక్షల రూపాయలంటే నమ్మశక్యం కాదు. తొక్కలో కెమేరా ఒకటి మొలలో పెట్టుకుని తనో కలం పోటుగాడిలా విర్రవీగిపోయే చంద్రశేఖర్ హవా జి.వి.ఎం.సి.లో బాగానే పనిచేస్తుంది. ఇ.ఇ.ల నుండి నెల మామూళ్లే కాకుండా టౌన్ ప్లానింగ్ విభాగం నుండి కేసుల వారీ ముడుపులు అందుకునే బి.ఎస్. గాడి బాగోతం ఈమధ్య ఈనాడు కాంపౌండ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో సీతంపేట డేట్ లైన్ పై రాస్తూ కార్పోరేషన్ బీటు చూసి అక్రమార్జనలో యాజమాన్యానికి పట్టుబడి పని పోగొట్టుకున్న ప్రసాద్ కన్నా దారుణంగా తయారైన బి.ఎస్.పై అవినీతి ఆరోపణలు ఇన్నీ అన్నీ కావు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకునిగా, మతప్రచారకుడుకె.ఎ.పాల్ ప్రెస్ మీట్ లలో డబ్బులు పంపిణీ చేసే మధ్యవర్తిగా, కార్పొరేషన్లో సెటిల్మెంట్లు చేసే బ్రోకర్ గా వీడు అనేక పాత్రల్లో జీవిస్తున్నా ఈనాడు స్ఠానిక నిర్వాహకులు పట్టించుకోకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. వీడు డెస్క్ లో వాళ్లని మేనేజ్ చేస్తున్నట్టు బయట ప్రచారం కూడా జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్టు ఈ ప్రచారంలో ఎంతోకొంత నిజం లేకుండా పోదుకదా? సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుని హోదాలో వీడు అమ్మాయిలను తన సొంత అవసరాలకు వాడుకుంటుంటాడని వీడి వ్యతిరేక వర్గం చెబుతుంటుంది.
(వీడి అక్రమార్జనపై సమగ్ర ఆధారాలతో కూడిన వ్యాసం కోసం తరువాయి అప్ డేట్ కోసం వేచి చూడండి. అదే విధంగా వీడి గురించి గాని, వీడిలాంటి బ్రోకర్ జర్నలిస్టుల గురించి గానీ మీకు తెలిసిన వివరాలను మా ఇ-మెయిల్ కు పంపడం గాని, లేదా ఐటం కింద కామెంట్ రూపంలో జోడించడం గానీ చేయడం మరవకండి.)

Monday, July 28, 2008

"చిరు" పార్టీ టిక్కెట్ కోసం శివశంకర్ దరఖాస్తు!

ఒకప్పటి జర్నలిస్టు... ఇప్పటి యాక్టివిస్టూ అయిన విశాఖపట్నానికి చెందిన ఎస్.ఎస్.శివశంకర్ చిరంజీవి పార్టీ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేశారు. గత ఎన్నికల నుంచే ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నశివశంకర్ కె.ఎ.పాల్ తో చేతులు కలిపి అతనికి మీడియా సహకరించేలా చేస్తూ ఆర్జిస్తున్న సొమ్మును ఖర్చుపెట్టడానికి సిద్ధమైన శివశంకర్ పై ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జర్నలిజం ముసుగులో విశాఖలో...

జర్నలిజం ముసుగులో విశాఖలో కొంతమంది వ్యక్తులు సాగిస్తున్న చీకటి వ్యవహారాలపై పోలీసులు నిఘా వేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉత్తరాంధ్రలో నకిలీ జర్నలిస్టులు

ఏ పత్రికలోనూ పని చేయకుండా జర్నలిస్టులగా చలామణీ అవుతూ అక్రమార్జనకు పాల్పడుతున్న నకిలీల సంఖ్య ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలలోనూ పెరుగుతోంది. "ఆపరేషన్ గజ" అంటూ ఇక్కడి అసలైన జర్నలిస్టులు ముద్దుగా పిలుచుకునే నకిలీలపై ప్రత్యేక కథనం...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో "దీన"పత్రికల హోరు!

పత్రికా ప్రచురణ రంగంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద ప్రచురణ కేంద్రంగా విరాజిల్లుతూ వస్తున్న విశాఖలో ఇప్పుడు "దీన"పత్రికల హోరు మొదలయింది. ఇంత వరకూ వార పత్రికగానో, పక్షపత్రిక గానో లేక మాస పత్రిక గానో ప్రచురితమవుతున్న పత్రికలన్నీ దినపత్రికల అవతారం ఎత్తుతున్నాయి. ఇప్పుడు ఉన్న పిరియాడిసిటీనే సక్రమంగా కొనసాగించలేక, యాడ్ వచ్చినప్పుడో లేక మరేదో ఆదాయం వచ్చినప్పుడో అరాకొరాగా చాలీచాలని పేజీలు వేస్తూ నెట్టుకు వస్తున్న వారంతా తమ పత్రికలను ఉన్నట్టుండి డైలీలుగా ఎందుకు మారుస్తున్నారో ఇప్పటికే మీకు అర్ధమై ఉండాలి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

Sunday, July 27, 2008

వి.జె.ఎఫ్. నిధుల గోల్ మాల్!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమం పేరిట ఏర్పాటైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వి।జె.ఎఫ్.) క్రమేణా తన లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోంది. తన బాధ్యతలను ట్రేడ్ యూనియన్లు హైజాక్ చేసుకుపోతుంటే మిన్నకుండిపోవడమే కాకుండా క్లబ్బుకి వస్తున్న ఆదాయాన్ని కైంకర్యం చేసే సంస్క్రుతిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. గతంలో కమిటీలోని ఒకరిద్దరు మాత్రమే అక్రమార్జనకు పాల్పడితే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అందిన కాడికి నొల్లుకుంటున్నారట! ఇందులో ఏమాత్రం నిజముందో వచ్చేవారం వరకు ఆగాల్సిందే!! సభ్యులను నిలువునా మోసం చేస్తున్న వి.జె.ఎఫ్. పాలకుల బండారాన్ని బట్టబయలు చేయడంలో ముఖ్యోద్దేశం మీకు తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

విజయవాడలో రౌడీ జర్నలిస్టులు!

విజయవాడ: ఈ నగరం రౌడీలకు నిలయమనేది మనవాళ్లందరికీ తెలిసిందే। కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు విలేఖర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ మండల విలేఖరులను దోచుకుంటున్న వైనమిది. వీళ్లిద్దరూ పేరుకే పెద్ద పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు కానీ, ప్రవర్తన తీరు మాత్రం వీధి రౌడీలను తలపిస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

ఆంధ్రభూమి సబ్ ఎడిటర్ లైంగిక వేధింపులు!

హైదరాబాద్: తోటి ఉద్యోగిని అని కూడా చూడకుండా ఆ ప్రబుద్దుడు ప్రవర్తిస్తూ వృత్తిని అపహాస్యం చేస్తున్న ఆంధ్రభూమి సబ్ ఎడిటర్ లైంగిక వేధింపులపై స్పెషల్ రిపోర్ట్.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

ఎ.ఎన్.ఎం.ని గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి

విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త (ఎ.ఎన్.ఎం.)ను తన మాయ మాటలతో లొంగదీసుకుని చివరకు గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి దురాగతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏడాదిలో మూడు అబార్షన్లు చేయించిన పోటుగాడి ఉదంతంపై ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీకాకుళం ఆంధ్రభూమి విలేఖరి అక్రమార్జన!

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ఆంధ్రభూమి విలేఖరిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అవినీతి, అక్రమార్జనపై సంపూర్ణ సమాచారం, సమగ్ర ఆధారాలతో వచ్చే వారం ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.