Monday, September 22, 2008

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కుంభకోణం!

దీక్షకు సిద్ధపడిన ఎస్.డి.వి. శేఖర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోతే సంఘం పెద్దలు బహిరంగంగా ప్రకటన చేయవచ్చు. సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఇప్పటివరకు జరిగిన వ్యవహారాన్ని సభ్యులకు తెలియజేసి మద్దతు కూడగట్టవచ్చు. కానీ సంఘం పెద్దలు అవేమీ చేయడం లేదంటే అనుమానాలు బలపడక ఏం చేస్తాయ్.
శేఖర్ పేరుకే పిచ్చివాడు కానీ వాడు చేస్తున్న వాదన పిచ్చిది కాదుకదా? అప్పులు చేసి డబ్బులు కట్టినవాళ్ల పరిస్థితి ఏమిటి? సంఘంలోని కొంతమంది నాయకులలా మిగతా వారు అడ్డదారుల్లో ౩.౩౦ లక్షల రూపాయలు కట్టలేదన్న విషయం వీరికి తెలియంది కాదు కాబట్టి వ్యవహారాన్ని త్వరగా తేలిస్తే మంచిది. కేబినెట్లో చర్చకు రానంత మాత్రాన మనకు జిల్లా కలెక్టర్ అడ్వాన్సు పొజిషన్ ఇచ్చిన స్థలం మనది కాకుండా పోదు కాబట్టి తక్షణం స్థలాన్ని పూర్తి మొత్తాన్ని కట్టిన వారికి తొలి ప్రాధాన్యతగా లాటరీ పద్దతిన పంపిణీ చేయడం మర్యాదదాయకం. లేకుంటే సంఘంపై వస్తున్న ఆరోపణలు నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది.
(పూర్తి వివరాలకు అప్డేట్ కోసం ఎదురుచూడండి.)

వి.జె.ఎఫ్. నిధుల గోల్ మాల్!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమం పేరిట ఏర్పాటైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వి.జె.ఎఫ్.) క్రమేణా తన లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోంది. తన బాధ్యతలను ట్రేడ్ యూనియన్లు హైజాక్ చేసుకుపోతుంటే మిన్నకుండిపోవడమే కాకుండా క్లబ్బుకి వస్తున్న ఆదాయాన్ని కైంకర్యం చేసే సంస్క్రుతిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. గతంలో కమిటీలోని ఒకరిద్దరు మాత్రమే అక్రమార్జనకు పాల్పడితే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అందిన కాడికి నొల్లుకుంటున్నారట! ఇందులో ఏమాత్రం నిజముందో వచ్చేవారం వరకు ఆగాల్సిందే!! సభ్యులను నిలువునా మోసం చేస్తున్న వి.జె.ఎఫ్. పాలకుల బండారాన్ని బట్టబయలు చేయడంలో ముఖ్యోద్దేశం మీకు తెలిసిందే.

విశాఖ కలెక్టరేట్లో కక్కుర్తి విలేఖర్లు

విశాఖ సమాచారం, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల విలేఖరులు కలెక్టరేట్లోకి అడుగుపెట్టారంటే అన్ని సెక్షన్ల అధికారులూ అప్రమత్తమవుతుంటారు. పొరపాటున కలెక్టరో, జాయింట్ కలెక్టరో అటువైపుగా వస్తున్నారన్నా పెద్దగా స్పందించని సిబ్బంది, సెక్షన్ అధికారులూ ఈ కలం వీరులు వస్తున్నారంటే మాత్రం ఉలిక్కిపడుతూంటారు. ఈ మీడియా మొనగాళ్ల హవా తగ్గించాలని ఉద్యోగులు ఏంత కోరినా ఇన్ఛార్జి పెద్దలు ఖాతరు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. వీళ్లు కలెక్టరేట్లో గడుపుతున్న సమయంలో అధిక భాగం వార్తల సేకరణ కంటే సొంత పైరవీలకే వెచ్చిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఈ మాట తోటి విలేఖరులే అంగీకరిస్తారు. కొంతమంది అధికారుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన విలేఖరుల గురించి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు ఇప్పటికైనా దృష్టిపెడితే మంచిది. లేదంటే, వాళ్ల అక్రమాలకు పెద్దల తోడ్పాటుకూడా ఉందని బయటి ప్రపంచం సైతం ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు.
(తరువాయి అప్డేట్ కోసం వేచిచూడండి)

జర్నలిస్టుల జేబులు నింపిన వినాయకుడు!

వినాయకుడే విశాఖలో జర్నలిస్టులకు వేలకు వేలు ఇప్పించింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ గణేష్ కుమార్ ఏ ఉద్దేశంతో ప్రచారాన్ని ఇంతలా నిర్వహించారో తెలియదు కానీ అయిదు పెద్ద పత్రికల విలేఖరులు మాత్రం తలో 10 వేల రూపాయలు వెనకేసుకున్నారు. దేవుడైనా ప్రచారానికి తప్పదు ముడుపులు!!!

Wednesday, August 20, 2008

విలేఖరులొస్తున్నారు... హాస్టల్ వార్డెన్లూ జాగ్రత్త!

అదేమిటో తెలియదు కానీ, శ్రీకాకుళం జిల్లాలో హాస్టల్ వార్డెన్లు విలేఖరులను చూస్తే భయపడి చస్తున్నారు. ఏమైందని ఎవర్ని ప్రశ్నించినా ఒకటే సమాధానం! ఏజెన్సీ సరిహద్దు గ్రామాలపై ఏనుగుల గుంపు దాడి జరిపినట్టు తమపై విలేఖరుల దండు వచ్చిపడుతోందంటూ వార్డెన్లు, హాస్టల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ జిల్లాలో విలేఖరుల ఆగడాలు పెచ్చుమీరిపోయాయి. ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికలకూ ఇక్కడ రిపోర్టర్లు ఉన్నట్టే వసూళ్లలో కూడా వీళ్లు తమదే పైచేయి అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వారం రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు పదిహేను పత్రికల జాబితాతో శ్రీకాకుళం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి నుంచి పదిహేను వేల రూపాయలు స్వాహా చేశారు. మరోపక్క ఏలూరు పత్రికల వాళ్లు తమ నలభై మంది జాబితాతో ఎలాగూ హాస్టల్ వార్డెన్లను బెదిరించి డబ్బులు చేసుకుంటున్నారు. పత్రికా రంగంలో ఇరవయ్యేళ్ల సీనియర్నని గొప్పలు చేప్పుకునే బ్రాహ్మణ జర్నలిస్టొకడు ఈమధ్య "ఎన్కౌంటర్" ప్రతినిధినంటూ బాహాటంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. కక్షకొలదీ వీడు ఎవడిపైన పడితే వాడిపైన లేనిపోని రాతలు రాసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని తెలియక ఆ పత్రిక యాజమాన్యం ఆయా చెత్త రాతలను ప్రచురిస్తూ ప్రోత్సహిస్తోంది. ఆమదాలవలస ఎమ్మెల్యే బి.సత్యవతిపై గత సంచికలో వీడు రాసిన రాతలను పరిశీలిస్తే వాడు ఎలాంటి వాడో తెలుస్తుంది. ఏకంగా పాతిక వేల రూపాయలు డిమాండ్ చేసిన వీడి ప్రయత్నం ఫలించలేదని అబద్దపు రాతలు రాసి తన దిర్బుద్దిని చాటుకున్నాడు. చివరికి అడగకుండానే అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్న జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తప్పుడు రాతలు రాసి మంత్రి ప్రత్యర్ధులైన టెక్కలి, పలాస ప్రాంతాలకు చెందిన ఇద్దరు నాయకుల వద్ద పది వేల రూపాయలు తీసుకున్నాడు.
(మరిన్ని వివరాలు వచ్చే అప్డేట్లో...)

బ్లాక్ మెయిల్ బాడుకోవు!

వీడిని వర్ణించడానికి ఇంతకన్నా మంచి పేరు దొరకలేదు. జర్నలిస్టు ముసుగులో శ్రీకాకుళం జిల్లాలో వీడు సాగిస్తున్న అరాచకాలకు వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. కంత్రీ సతీష్ గా స్థానికంగా పేరుమోసిన వీడి అసలు పేరు కోనె సతీష్ కుమార్. జిల్లా జర్నలిస్టులకే కాకుండా పక్క జిల్లాల వారికి కూడా తలనొప్పిగా తయారైన వీడి లీలలపై ప్రత్యేక కథనం...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Thursday, August 7, 2008

రాష్ట్ర చిన్న పత్రికల సంఘంలో చీలిక?

రాష్ట్ర చిన్న పత్రికల సంఘంలో చీలిక ఏర్పడిందా? తాజా పరిస్థితులు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. చిన్న, మధ్యతరహా పత్రికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న సంఘం అందరి సమస్యలపై కాకుండా కొందరికే పరిమితమవుతోందని ఆరోపిస్తూ "ఎస్మా" ఆవిర్భవించింది. ఎడిటర్స్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ పేరుతో కార్య రంగంలోకి దిగిన చీలిక వర్గం తన తొలి ప్రయత్నంలోనే అందరి అభినందనలు అందుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఎదురైన ఎల్.ఎ. ప్రకటనల సమస్యను పరిష్కరించేందుకు "ఎస్మా" చేసిన కృషి ఫలించి, తిరిగి పాత పద్ధతి అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సమాయాత్తమవుతోంది. జిల్లా యేతర ప్రాంతాల నుంచి ప్రచురితమవితున్న చిన్న, మధ్యతరహా పత్రికలకు ఎల్.ఎ. ప్రకటనలను నిలిపివేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి, పరిస్థితిని చక్కదిద్దడానికి కూడా ప్రస్తుత చిన్న పత్రికల సంఘం ప్రయత్నించని తరుణంలో "ఎస్మా" రంగంలోకి దిగి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో చర్చించి ఆయనతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ కు డి.ఒ. లెటర్ రాయించి సమస్య పరిష్కారానికి కృషిచేయడం కూడా ప్రస్తుత చిన్న పత్రికల సంఘానికి నాయకత్వం వహిస్తున్న వారిలో కొంతమందికి నచ్చినట్టులేదు. అందుకే "ఎస్మా" ప్రయత్నాలను అడ్డుకునే సాహసం చేస్తున్నారు. "అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు" అన్న సామెతను ఈ పదవి పిచ్చి నాయకులు సార్ధకం చేస్తున్నారు. రాష్ట్రంలో చిన్న పత్రికలకు సంధించి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఈ సంఘం ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కార్యవర్గంలో ఉన్న నాయకుల పత్రికల వరకే చూసుకుంటుండడం విమర్శలకు దారిస్తోంది. ఈ స్వార్ధపూరిత నాయకత్వాన్ని వ్యతిరేకించాలని చాలా మందికి ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎవరూ కూడా ఆ సాహసం చేయలేకపోయారు. బహుశా ఆ ధైర్యం తొలుత "ఎస్మా" నాయకులకే వచ్చిందేమో!
గతంలో విశాఖపట్నంలోని చిన్న పత్రికల జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఆర్టీసీ బస్ పాసుల జారీ సందర్భంగా ఎదురైన సమస్యను కూడా ఈ చిన్న పత్రికల సంఘం పరిష్కరించలేక తన చేతకాని తనాన్ని ఒప్పుకోలేక జర్నలిస్టుల సంఘాల వైఫల్యం వల్లే ఈ సమస్య ఎదురైందని సెలవిచ్చింది. ఈ సమస్య ఇప్పటికీ అలాగే అపరిష్కృతంగా ఉండిపోయింది. ఇదే విధంగా ఇళ్ల స్థలాల సమస్య కూడా పెండింగ్ లో పడింది. ఇక విజయనగరంలో కూడా ప్రకటనల విషయంలో ఎదురైన సమస్యలను అక్కడి జర్నలిస్టులే పరిష్కరించుకున్నారు తప్ప ఏ సంఘమూ తలదూర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘాల అవసరం చిన్న పత్రికలకు ఎంతవరకు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం సమస్యలు ఎదుర్కొంటున్న పత్రికల చేతుల్లోనే ఉందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.