Thursday, December 6, 2007

ఎ.ఎన్.ఎం.ని గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి

విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త (ఎ.ఎన్.ఎం.)ను తన మాయ మాటలతో లొంగదీసుకుని చివరకు గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి దురాగతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏడాదిలో మూడు అబార్షన్లు చేయించిన పోటుగాడి ఉదంతంపై ప్రత్యేక కథనం.

విజయవాడలో రౌడీ జర్నలిస్టులు!

విజయవాడ: ఈ నగరం రౌడీలకు నిలయమనేది మనవాళ్లందరికీ తెలిసిందే. కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు విలేఖర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ మండల విలేఖరులను దోచుకుంటున్న వైనమిది. వీళ్లిద్దరూ పేరుకే పెద్ద పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు కానీ, ప్రవర్తన తీరు మాత్రం వీధి రౌడీలను తలపిస్తోంది. వీళ్ల దౌర్జన్యాలపై ప్రత్యేక కథనాలు వచ్చే అప్ డేట్లో...!

వి.జె.ఎఫ్. నిధుల గోల్ మాల్!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమం పేరిట ఏర్పాటైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వి.జె.ఎఫ్.) క్రమేణా తన లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోంది. తన బాధ్యతలను ట్రేడ్ యూనియన్లు హైజాక్ చేసుకుపోతుంటే మిన్నకుండిపోవడమే కాకుండా క్లబ్బుకి వస్తున్న ఆదాయాన్ని కైంకర్యం చేసే సంస్క్రుతిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. గతంలో కమిటీలోని ఒకరిద్దరు మాత్రమే అక్రమార్జనకు పాల్పడితే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అందిన కాడికి నొల్లుకుంటున్నారట! ఇందులో ఏమాత్రం నిజముందో వచ్చేవారం వరకు ఆగాల్సిందే!! సభ్యులను నిలువునా మోసం చేస్తున్న వి.జె.ఎఫ్. పాలకుల బండారాన్ని బట్టబయలు చేయడంలో ముఖ్యోద్దేశం మీకు తెలిసిందే.

Saturday, October 6, 2007

జర్నలిస్టుల భూ వ్యాపారం!

రియల్ ఎస్టేట్ భూం ఎందరో జీరోలని హీరోలను చేసినట్టే, విశాఖలో కొంతమంది జర్నలిస్టులను కూడా చేసింది. వాళ్లు ఎంత కూడవెట్టారోనని నోళ్లు వెళ్లవెట్టడం కంటే, మనమూ వీళ్లని ఆదర్శంగా తీసుకుని ఫీల్డుకి దూరంగా ఉంటూ ఆర్జిద్దాం!

రామాంజనేయులు (ఈనాడు)
సురేష్ కుమార్ (ఈనాడు)
రాజేష్ కుమార్ (ఈనాడు)
నాగేశ్వర రావు (ఈనాడు)
పి.నారాయణరావు (విశాఖ సమాచారం)
ఆర్.వి.కృష్ణారావు (ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి)
ఆర్.వి.బాబూరావు (కేబుల్ విజన్)
బి.రవికుమార్ (స్టేట్ టైమ్స్)
ఎస్.ఎస్.శివశంకర్ (విజన్, తేజ టీవీ)
కె.ఎం.పి.పట్నాయక్ (డెక్కన్ క్రానికల్)
ఎం.కృష్ణారావు (ఆంధ్రావాయిస్)
ఎస్.దుర్గారావు (విజన్)
ఎ.మురళీకృష్ణ (విజన్)
ఎన్.బాపూరావు (గ్రేటర్ న్యూస్)
ఎం.కన్నఅప్పారావు (దిశ)
సన్నిధానం శాస్త్రి (ఆంధ్రభూమి)

జర్నలిస్టులుగా మారిన రియల్టర్లు!

జి.గిరిబాబు (ఆంధ్రావాయిస్)
మళ్ల విజయప్రసాద్ (విజన్)

వీళ్లలో నిశితంగా పరిశీలిస్తే చాలా మంది ఫీల్డులో లేరనిపిస్తుంది కదూ. నిజమే మరి ఎక్కడ ఆదాయం బగుంటే అక్కడుండేవాడే నిజమైన ఎ(జ)ర్నలిస్టు! అదేంటీ కొద్దిమంది పేర్లే రాసి మిగిలిన వాళ్ల పేర్లు వదిలేశారేంటీ అని అనుకోవద్దు. అందరి పేర్లూ ఒకేసారి ఇచ్చేస్తే థ్రిల్లేముంటుంది. సీరియల్గా ఇద్దామనే ప్రయత్నం. మీకు తెలిసిన సమాచారం కూడా జోడిస్తే సంపూర్ణంగా ఉంటుంది.

Tuesday, October 2, 2007

విశాఖ డి.ఆర్.ఒ. చేతిలో కీలుబొమ్మలీ విలేఖరులు

విశాఖ సమాచారం, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల విలేఖరులు కలెక్టరేట్లోకి అడుగుపెట్టారంటే అన్ని సెక్షన్ల అధికారులూ అప్రమత్తమవుతుంటారు. పొరపాటున కలెక్టరో, జాయింట్ కలెక్టరో అటువైపుగా వస్తున్నారన్నా పెద్దగా స్పందించని సిబ్బంది, సెక్షన్ అధికారులూ ఈ కలం వీరులు వస్తున్నారంటే మాత్రం ఉలిక్కిపడుతూంటారు. ఎందుకంటే, వీళ్లకీ డిఆర్వోకీ మధ్య ఉన్న సంబంధాలు అలాంటివి మరి. కలెక్టరేట్లో ఈ మీడియా మొనగాళ్ల హవా తగ్గించాలని ఉద్యోగులు ఏంత కోరినా ఇన్ఛార్జి పెద్దలు ఖాతరు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు.
వీళ్లు కలెక్టరేట్లో గడుపుతున్న సమయంలో అధిక భాగం వార్తల సేకరణ కంటే సొంత పైరవీలకే వెచ్చిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఈ మాట తోటి విలేఖరులే అంగీకరిస్తారు.

డిఆర్వో చేతిలో కీలుబొమ్మలుగా మారిన విలేఖరుల గురించి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు ఇప్పటికైనా దృష్టిపెడితే మంచిది. లేదంటే, వాళ్ల అక్రమాలకు పెద్దల తోడ్పాటుకూడా ఉందని బయటి ప్రపంచం సైతం ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు.

జర్నలిస్టుల జేబులు నింపిన వినాయకుడు!



వినాయకుడే విశాఖలో జర్నలిస్టులకు వేలకు వేలు ఇప్పించింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ గణేష్ కుమార్ ఏ ఉద్దేశంతో ప్రచారాన్ని ఇంతలా నిర్వహించారో తెలియదు కానీ అయిదు పెద్ద పత్రికల విలేఖరులు మాత్రం తలో 10 వేల రూపాయలు వెనకేసుకున్నారు. దేవుడైనా ప్రచారానికి తప్పదు ముడుపులు!!!

మహాత్ముని మెడలో దండలు లూఠీ!

మహాత్ముని మెడలో పూల దండలు దొంగిలిస్తున్నట్టుంది కదూ ఈ చిత్రం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పాలవలస రాజశేఖరం చేస్తున్నది అదే!! దీన్నిబట్టి ఆయన ఎంత పిసినారో అర్ధమై ఉంటుంది. బాపూజీ బర్త్ డే సందర్భంగా నేతలు వేసిన దండల్ని రాజశేఖరం గాడు, ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులూ చూస్తుండగానే తీసేసి తన కారుకి తగిలించమన్నాడట!

రూ.5 కోట్లు వసూలు చేసిన "సూర్య"

"సూర్య" ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

విలేఖరుల పొట్టలు కొడుతున్న వామపక్షాల పత్రికలు

యుగంధర్ రెడ్డే "సాక్షి" విశాఖ బ్యూరో చీఫ్?

విశాఖ జర్నలిస్టుల భూబాగోతం!

ఒరిస్సాలో "సిక్కోలు" జిల్లా జర్నలిస్టు సారా వ్యాపారం!

గాజువాక ఆంధ్రభూమి విలేఖరి అక్రమార్జన

ఒంగోలు ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ బెదిరింపులు

ఒంగోలు ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ బెదిరింపులు

మావోయిస్టుల పేరిట గుంటూరులో మీడియా వసూళ్లు!

చిలకలూరిపేటలో విలేఖరులే అమ్మాయిల బ్రోకర్లు

నల్గొండ వార్త విలేఖరి అవినీతి బాగోతం!

(నల్గొండ నుంచి రాజేష్)

నల్గొండ వార్త విలేఖరిపై అనేక ఆరోపణలు వచ్చినా యాజమాన్యం దృష్టిలో వాడు మంచి బాలుడిగా నటిస్తుండటం వల్ల చర్యలు శూన్యమన్న ప్రచారం వినిపిస్తోంది. తెలుగు మహిళా నాయకురాలితో ఈ వెధవ పెట్టుకున్న అక్రమ సంబంధం బయటపడితే గానీ వీడి బాగోతం వెలుగుచూడదన్నది తోటి జర్నలిస్టుల అభిమతం. సబ్ ఎడిటర్తో వీడికి ఉన్న లింకులు కూడా ఒకటొకటిగా వెలుగుచూస్తున్నాయి.

నిజాలు రాసే జర్నలిస్టులకి ఆహ్వానం

సరైన ఆధారాలతో, సమగ్ర సమాచారంతో ఈ బ్లాగ్కి ఎవరైనా వార్తలు రాయొచ్చు. రాయడానికి వేదిక దొరికింది కదాని దయచేసి ఏదిపడితే అది రాసి పంపవద్దు. మీరు రాసే ఐటంలో విషయం ఉంటే దాన్ని తప్పకుండా బ్లాగ్లో పబ్లిష్ చేస్తాం. ఈ బ్లాగ్ని నడుపుతున్న ఉద్దేశం జర్నలిస్టుల్ని సరిదిద్దాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని పాఠకులు గమనించ ప్రార్ధన.

ఎడిటర్,
మీడియా డైరీ,
సూర్యారావుపేట,
విజయవాడ-2

Monday, October 1, 2007

విజయభాను ఎడిటర్ పై విశాఖ సమాచారం మనుషుల దాడి

(విశాఖ నుంచి ప్రకాష్)

విశాఖ కేంద్రంగా ప్రచురితం అవుతున్న రెండు చిన్న పత్రికల మధ్య నెలకొని ఉన్న అంతర్గత గొడవలు ఒక్కసారిగా పురివిప్పి ఒక వర్గంపై దాడికి ఉసిగొల్పాయి. విజయభాను ఎడిటర్ ఇంటిపై దాడికి పాల్పడిన వారు విశాఖ సమాచారమ్ యాజమాన్యం పురమాయించిన వీధి రౌడీలన్నది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తరపువాళ్లు చేయించిన దాడిని నారాయణరావు పట్నాయక్ విజయభాను వాళ్లు చేయించిన దాడిగా బయటి ప్రపంచాని నమ్మించవచ్చేమో గానీ, తోటి పాత్రికేయ సమాజాన్ని మాత్రం నమ్మించడం చాలా కష్టం! పరాయి ఆడదానితో సంబంధాలు పెట్టుకునే ప్రతి వెధవకూ నారాయణరావుకి జరిగిన శాస్తే జరుగుతుందనడానికి చెప్పడానికి ఒక మచ్చుతునకగా మాత్రమే ఈ సంఘటనను చూడాలి తప్ప రెండు పత్రికల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసే ప్రయత్నాలు చెయ్యకూడదు. విశాఖలోని కొంతమంది పెద్ద ఎ(జ)ర్నలిస్టులు మాత్రం దాన్ని విజయభాను యాజమాన్యం చేయించిన దాడిగానే ప్రచారం చించడం ఖోసం సే ప్రయత్నం చేస్తున్నరు. దీన్నే మేం ఖండిస్తున్నాం. నారాయణరావు చేసిన తప్పు ఎంతమంది చేయడంలేదని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ఇలా తప్పు చేసిన ప్రతివాడికీ మనవాళ్లు సపోర్టు చేస్తున్నారా? ఆలోచించండి. నారాయణరావుపై జరిగిన దాడి వ్యక్తిగతమైంది కాదని జనాన్నీ, ప్రత్యేకించి ఇంట్లోవాళ్లనీ నమ్మించడం కోసం కడకు విజయభాను ఎం.డి. ఇంటిపై దాడికి ఒడిగట్టిన వైనం అందరికీ తెలిసిందే. ఇలాంటి తెలివితేటలు ఎదగడికి చూపించాలే కానీ ఒకర్ని దెబ్బతీయడానికి కాదని నారాయణరావు, అతన్ని వెనకేసుకు వస్తున్న ఎర్నలిస్టులూ గ్రహిస్తే మంచిది. వెధవలకు మధ్దతుగా ధర్నాలూ, ఆందోళనలూ చేసి మనపరువు మనం తీసుకోవద్దు.

Saturday, September 15, 2007

ఎన్టీపీసీలో ప్రకటనల కుంభకోణం

తాజా అప్డేట్ కోసం వేచి చూడండి...

విశాఖ డిపిఆర్ఒ ఓవరేక్షన్!

అముద్రితాలకు అధిక ప్రాధాన్యం!!

హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద పబ్లికేషన్ కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖపట్నంలో సమాచార శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారింది. అముద్రితాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిత్యం వస్తున్న వాటిని అసలు పట్టించుకోని జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఒ) వ్యవహారశైలి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. మీడియాను మేనేజ్ చేయడంలో ఏమాత్రం అనుభవం లేని "స్త్రీ"మతి లక్ష్మీకాంతంకు కీలకమైన విశాఖలో పనిచేస్తున్నానన్నకనీస స్ప్రుహ లేకపోవడం విచారకరమే.

ఆమె డిపిఆర్ఒగా రావడం ఎర్నలిస్టులకి అమితానందంగానే ఉన్నప్పటికీ, ముక్కుసూటిగా వెళ్లిపోయే వాళ్లను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉన్న పరిస్తితి గతంలో ఏ డిపిఆర్ఒ హయాంలోనూ కనీవినీ ఎరుగలేదని పాత్రికేయులు వాపోతున్నా, ఉన్నతాధికారులకు మాత్రం చీమకుట్టినట్లైనా ఉండకపోవడం మన విశాఖ చేసుకున్న దురద్రుష్టమే!

జర్నలిస్టులకు ద్రోహం చేస్తూ వేర్వేరు అవసరాల పేరిట పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులను కైంకర్యం చేస్తున్న డిపిఆర్ఒ కార్యాలయం పనితీరుపై వరుస కథనాల సమాహారం వచ్చే అప్డేట్ నుంచి...

... విశాఖపట్నం నుంచి రమేష్

Wednesday, September 12, 2007

వైఎస్సార్ బహిరంగ లేఖ!

భాగ్యనగరం లో బాంబులు వేశారు. పంజాగుట్ట లో ఫ్లైఓవర్ కూలింది…అయితే ఎంటంట? ఆకాశమేమైనా ఊడిపడిందా... ప్రపంచంలో ప్రతి చోటా జరుగుతున్నయే కదా? ఆ రెండు పత్రికలకు పనేమిలేక ఏదో పెద్దవిషయం అన్నట్లు హెడ్డింగులు పెట్టి రాస్తున్నాయి.అన్నిటికి నాదే భాద్యత అన్నట్లు రాస్తారేంటి? ముఖ్యమంత్రిగా నాకు ఎన్నో పనులు ఉంటాయ్.

* మా అబ్బాయి పెట్టబోయే పేపర్,టివి చానల్ కి అన్ని సహాయాలు అందించాలా…
* మా వాడు పెడుతున్న సిమెంటు ఫాక్టరికి అన్ని సదుపాయాలు, భూమి సమకూర్చాలా…
* మా తమ్ముడు అక్రమ కట్టడాలు అన్ని క్రమబద్దం చెయ్యాలా…
* నా గాలి స్నేహితుడికి గనులన్ని లీజుకి ఇచ్చి అక్రమ తవ్వకాలు చేయించాలా…
* వాడు పెట్టబోయే గాలి (స్టీలు) ఫ్యాక్టరీకి అన్ని వసతులు ఆఘమేగాల మీద ఇప్పించాలా…
* మా తోడల్లుడు కి ప్రోజెక్టులు కేటాయించాలా…
* నా బామ్మర్ది కడప ని దోచుకోవటానికి, ఏలూరు లో రైతులని బెదిరించి పొలాలు ఆక్రమిచుకోవటానికి
సహాయం చెయ్యాలా…
* ఆ రెండు పత్రికలని మూయించాలా…
* రామోజీని సర్వనాశనం చేయాలా…
* నా ధనయజ్ఞం పూర్తికావటానికి ఇంకెన్ని ప్రొజెక్టులు కూల్చాలో అలోచించాలా…
* జైళ్ళల్లో ఉన్న మా పార్టీ హంతకులకి, గూండాలకి క్షమాబిక్ష పెట్టాలా…
* ఇడుపులపాయ ఎస్టేటు కి అన్ని సదుపాయాలు కల్పించాలా, విలువ పెగటానికి చుట్టుపక్కల గవర్నమెంటు
సొమ్ముతో చుట్టుపక్కల ప్రోజక్టులు కట్టాలా…
* నా అసైండు భూములను కాపాడుకోవాలా ( నేను ప్రభుత్వానికి ఇచ్చేసినా, నా మీద అభిమానంతో ఆ భూములు
ఎవ్వరూ తీసుకోలెదు కదా, మళ్ళీ నేనే అన్ని భూములు సాగుచేసుకోవాలా…)
* వట్టి ఆక్రమించిన అసైండు భూముల చేపల చెరువులు కాపాడాలా…
* నా బంగారు సత్తిబాబు ఉత్తరాంధ్రాని ఆక్రమించుకోవటానికి, ఓల్స్ వాగన్ డబ్బులు దొ..టానికి నా సహాయం
చెయాలా…
* ఏదో మా సూరీడు ముచ్చట పడిన డీపెప్,మరి కొన్ని బయటకు రాని కుంభకోణాలన్నిటిని జాగ్రత్తగా
మూసేయ్యాలా…
* ఇంకా ‘ఇందిర, రాజీవ్’ ల పేర్లు పెట్టడానికి ఎమైనా పాకి దొడ్లు, పందుల దొడ్లు మిగిలి వున్నాయమో అని
అలోచించాలా…
* నేను, నా జనాలు ఉండటానికి, ప్రజల సొమ్ముతో ఇంకొక పెద్ద భవంతి కట్టించుకోవలా…
* నన్ను నమ్ముకున్న ఫాక్షనిస్టులందరికి రక్షణ కల్పించాలా…
* నా ధనయజ్ఞానికి సాయం చేసే కాంట్రాక్టులందరి ప్రయోజనాలు కాపాడాలా…
* మా మంత్రులు డ్రైవర్లు,నౌకర్లు పేరిట ఫాక్టరీలు పెట్టటానికి వసూలు కాని లోనులు ఇవ్వాలా…
* రైతుల భూములన్ని మా వాళ్ళకి తక్కువ ధరలకి పరిశ్రమల పేరుతో ఇప్పించాలా…
* మొత్తం ప్రభుత్వం తోనే రియల్ ఎస్టేట్ వ్యభిచారం చేయించాలా…
* చంద్రబాబుని కడిగేయాలా…

ఇంకా ఇటువంటి ఎన్నో ప్రజలకు ఉపయోగ పడే పనులలో బిజీ గా ఉంటే ఈ రోజూవారి బాంబులు, ప్రోజెక్టులు కూలటాలు లాంటి సంఘటనలకు ఎందుకంత ఆక్రొశం, ఎవరైనా ఏమి చెయ్యగలరు,మీరందరు అలవాటు పడాలి, లేదంటే అందరిని కడిగేస్తా… అయినా బాంబులతో పోయిన వాళ్ళకి “ఇందిరా బాంబుల పధకం” కింద మరియు ఫ్లైఓవర్, ప్రోజెక్టులు కూలితే పొయేవళ్ళకి “రాజీవ్ కుప్పకూలిన ప్రొజెక్టుల పధకం” కింద పరిహారం ఇస్తాము కదా ఇంకెందుకు మీ ఏడుపులు?

సదా మీ షేవ్ లో
రాజీవ్(రౌడీ)శేఖర్ రెడ్డి

(నేనుసైతం సౌజన్యంతో...)