Monday, September 22, 2008

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కుంభకోణం!

దీక్షకు సిద్ధపడిన ఎస్.డి.వి. శేఖర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోతే సంఘం పెద్దలు బహిరంగంగా ప్రకటన చేయవచ్చు. సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ఇప్పటివరకు జరిగిన వ్యవహారాన్ని సభ్యులకు తెలియజేసి మద్దతు కూడగట్టవచ్చు. కానీ సంఘం పెద్దలు అవేమీ చేయడం లేదంటే అనుమానాలు బలపడక ఏం చేస్తాయ్.
శేఖర్ పేరుకే పిచ్చివాడు కానీ వాడు చేస్తున్న వాదన పిచ్చిది కాదుకదా? అప్పులు చేసి డబ్బులు కట్టినవాళ్ల పరిస్థితి ఏమిటి? సంఘంలోని కొంతమంది నాయకులలా మిగతా వారు అడ్డదారుల్లో ౩.౩౦ లక్షల రూపాయలు కట్టలేదన్న విషయం వీరికి తెలియంది కాదు కాబట్టి వ్యవహారాన్ని త్వరగా తేలిస్తే మంచిది. కేబినెట్లో చర్చకు రానంత మాత్రాన మనకు జిల్లా కలెక్టర్ అడ్వాన్సు పొజిషన్ ఇచ్చిన స్థలం మనది కాకుండా పోదు కాబట్టి తక్షణం స్థలాన్ని పూర్తి మొత్తాన్ని కట్టిన వారికి తొలి ప్రాధాన్యతగా లాటరీ పద్దతిన పంపిణీ చేయడం మర్యాదదాయకం. లేకుంటే సంఘంపై వస్తున్న ఆరోపణలు నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది.
(పూర్తి వివరాలకు అప్డేట్ కోసం ఎదురుచూడండి.)

2 comments:

Unknown said...

You have provided good information

easwarprakash@yahoo.com

Unknown said...

కలం సాక్షిగా అంతా నిజమే రాస్తాం... అబద్దం రాయం!